ద్విపదభాగవతం - మధురకాండ : అక్రూరునితోఁ గుంతి తనకష్టములను జెప్పుట
అనిపల్కుటయుఁ గొంతి యక్రూరుఁ జూచి
యనుకంపతోడ నిట్లని యల్లఁబలికె
“ఆరాజు సముఁడౌను యతని నందనులు
క్రూరులు ప్రజ వీరిఁ గొలువంగనీరు,
అదిగాక బిడ్డల నందఱిఁ ద్రోచి
మదిఁబూని బంధించి మడుగులోపలును
గరళంబు పెట్టించి ఘనసర్పవితతి
పరువడి గరపింపఁ బ్రాణగండములుఁ
దలఁచిన వీరును తప్పుగాఁ గొనరు
వలదని సుతులను వారింపఁ డతఁడు
దైవంబు కతన నింతలు బారులడఁగె
గోవిందుతోడ మా కుశలంబుఁ జెప్పు. - 490
పుట్టిన యిల్లునుఁ బొరిఁ జూచ్చినిల్లు
నిట్టిదె మా భాగ్య మేమంచు వగవ
దేవకి కడుపున దేవేంద్రవంద్యుఁ
డావిష్ణుఁడుదయించునని పెద్దలాడఁ
బలుకులు విందు నా భాగ్యంబు కతనఁ
దలఁచిన తలఁపులు దలకూర్చె దైవ”
మ ని చెప్పుటయు విని యక్రూరుఁ డంత
వినయంబుచేఁ గొని విదురుఁడుఁ దాను